
క్రీడలు

అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో పోస్టుకు కనీసం రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ దళారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల పేరుతో కొందరు మధ్యవర్తులు డబ్బు వసూలు చేస్తుండగా, సీడీపీవోలు, పర్యవేక్షకులు కూడా ఇందులో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 239 పోస్టుల భర్తీకి మొత్తం 519 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హులుగా 471 మందిని గుర్తించారు. ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. అయితే చివరి ఎంపిక దశలో ముడుపుల వ్యవహారం చెలరేగడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరిగింది. అధికారులు డబ్బు ఇవ్వొద్దని, ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!