

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనంపై రాహుల్ గాంధీ గళం వినిపించారని, అలాంటి అంశాలను ప్రశ్నించినందుకు ఆయనపై కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులపై రాహుల్ ప్రశ్నించిన విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.
అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించలేరని పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా పోరాడిందని పేర్కొన్నారు. దళితులపై వివక్షను అరికట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే అంటరానితనం నిర్మూలన కోసం ఆర్ఎస్ఎస్ చేసిన పోరాటాలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!