

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి, బోల్లేపల్లి, రాజనపల్లి గ్రామాల సరిహద్దుల్లో పెద్దగుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది. స్థానికుల కథనం ప్రకారం సుమారు 50 ఏళ్ల క్రితం గుట్టపై స్వామివారి పాదముద్రలు కనిపించడంతో ఈ క్షేత్రానికి ప్రాచుర్యం లభించింది. అప్పటి నుంచి శ్రావణ మాసంలో ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించేవారు.
అయితే వివిధ కారణాలతో గత 20 ఏళ్లుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల స్వామివారు గ్రామస్థుల కలలో కనిపించి గుట్టపై మళ్లీ పూజలు ప్రారంభించాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. దీంతో భక్తులు గుట్ట వద్దకు చేరుకుని ధూపదీప నైవేద్యాలతో పూజలను పునఃప్రారంభించారు. ప్రస్తుతం స్వామివారి పాదముద్రలు, ఇతర ఆనవాళ్లు కనిపిస్తుండటంతో భక్తుల రాక పెరుగుతోంది. ఈ క్షేత్రంలో అధికారికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని, ఆలయ అభివృద్ధికి అధికారులు, దేవాదాయ శాఖ సహకరించాలని నాయకపల్లి, బోల్లేపల్లి, రాజనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!