
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో కొంతసేపు అందుబాటులో లేకపోవడంపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుమారు ఐదు గంటల పాటు వీడియో అందుబాటులో లేకపోవడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మెటా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగతంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ, ఆదేశాలను పాటించకపోతే సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!