

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారంలో అక్రమాల ఆరోపణలు విద్యా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సొంత భూమి పత్రాలు, నిర్దేశిత కార్పస్ ఫండ్ వంటి తప్పనిసరి నిబంధనలు పాటించకపోయినా 50కి పైగా కాలేజీలకు ఏళ్లుగా గుర్తింపులు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓయూ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఓయూ పరిధిలోని 780 అనుబంధ కళాశాలలు ఈ నెల 31లోగా ఒరిజినల్ భూమి పత్రాలు, తాజా ఈసీ, కార్పస్ ఫండ్ వివరాలను సమర్పించాలని డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ ఆదేశించింది. గడువులోగా పత్రాలు సమర్పించకపోతే అఫిలియేషన్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సివిల్ జస్టిస్ సొసైటీ డిమాండ్ చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!