

బండారు సత్యనారాయణ మూర్తి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతగా ఎన్.టి. రామారావును కొనియాడారు. సినీరంగంలో రాముడు, కృష్ణుడిగా కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్, ప్రజాసేవ కోసం సినీరంగాన్ని విడిచిపెట్టి తెలుగు దేశం పార్టీను స్థాపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అహంకార రాజకీయాలకు ఎదురు నిలిచి తెలుగు వారి గౌరవాన్ని కాపాడిన నాయకుడని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 202 సీట్లతో విజయం సాధించి ప్రాంతీయ పార్టీలకు కొత్త దారి చూపారని ఆయన అన్నారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేసి సంక్షేమ పాలనకు నాంది పలికారని, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఆయన లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారత కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించి, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఎన్. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ద్వారా యువతలో నమ్మకం పెంచారని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!