
ఓటీటీ

ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివే పేద విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూన్ 12 నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి అదనంగా ఈ కొత్త పథకం అమలు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా దేశంలోనే ప్రభుత్వ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ మరియు మిడ్ డే మీల్స్ రెండూ అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. విద్యార్థులకు దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీ, బొండాలు వంటి వంటకాలు, అలాగే చట్నీ, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అందించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం ఏటా సుమారు రూ. 180 కోట్ల బడ్జెట్ కేటాయించనుంది. సుమారు 1.92 లక్షల మంది విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!