

హెచ్-1బీ, ఎల్-1 వీసాల పునరుద్ధరణ (రెన్యువల్) ప్రక్రియపై కూడా కొత్త రుసుములు విధించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ, సాంకేతిక రంగ నిపుణులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త వీసాల జారీ సమయంలో అదనపు రుసుములు వసూలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం, ఇకపై అదే యాజమాన్యం తమ ఉద్యోగి వీసా గడువు పొడిగింపుకు దరఖాస్తు చేసినా అదనపు ఫీజులు విధించాలని పరిశీలిస్తోంది. ప్రస్తుతం యాజమాన్యాలు కనీసం 4,000 డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి.
ఈ కొత్త ప్రతిపాదనతో విదేశీ ఉద్యోగులను కొనసాగించే సంస్థలపై ఆర్థిక భారం మరింత పెరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసాలకు భారీ రుసుములు విధించాలన్న గత నిర్ణయానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడంతో, ఇప్పుడు వీసా రెన్యువల్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చర్య ద్వారా అమెరికాకు ఏటా 150 మిలియన్ డాలర్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!