
జనరల్

నేపాల్లో భారీ వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో భోటేకోశీ నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఉత్తర జిల్లాల్లో పలు గ్రామాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఆరు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ విపత్తులో పలువురు భారతీయులు, ఎన్ఆర్ఐలు గల్లంతైనట్లు తెలుస్తోంది.
వరద బాధితులను ఆదుకునేందుకు భారత్ తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. నేపాల్కు 10 టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, గుడారాలు, దుప్పట్లు, సోలార్ లైట్లు వంటి అత్యవసర వస్తువులు ఉన్నాయి. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!