

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధర్మన్’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్లైన్తో రూపొందుతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ.. రజినీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు.
‘ధర్మన్’ తర్వాత తన తదుపరి సినిమా శిలంబరసన్ TRతో ఉంటుందని అశ్వత్ మరిముత్తు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఇది చాలా మంచి సినిమాగా ఉండబోతుందని చెప్పారు. ప్రస్తుతం శింబు ‘అరసన్’ సినిమాతో బిజీగా ఉన్నారని, ఆ సినిమా పూర్తయ్యే సమయానికి ‘ధర్మన్’ షూటింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే శింబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని అశ్వత్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!