

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ‘పంజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2011లో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 2న 4K వర్షన్లో రీ-రిలీజ్ కానుంది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, పవన్ అభిమానుల్లో మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ను సొంతం చేసుకుంది.

‘పంజా’కు యూవన్ శంకర్ రాజా అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నేటి స్టార్ హీరో అడివి శేష్ విలన్గా నటించడం మరో ప్రత్యేకత. ఇటీవల ఖుషి, జల్సా, తమ్ముడు వంటి పవన్ కళ్యాణ్ సినిమాల రీ-రిలీజ్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘పంజా’ 4K రీ-రిలీజ్కు కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి థియేటర్లలో పవన్ అభిమానులు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!