
జనరల్

నేపాల్లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించగా, బాధితులను ఆదుకునేందుకు సహాయక, రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు చర్యలు చేపడుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి నేపాల్ పర్యాటక మండలి ఇప్పటివరకు 117 మందిని రక్షించింది. వీరిలో 85 మంది భారతీయులు ఉన్నారు. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు, సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!