

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3.90 లక్షల మంది గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు రాష్ట్రవ్యాప్త ఫ్లాష్ సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం (TADF), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్తంగా ఇచ్చిన పిలుపుతో ఈ సమ్మె జరిగింది. ఓలా, ఉబెర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, పోర్టర్ వంటి సంస్థలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గూడ్స్ వాహన డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఉద్యమానికి పలు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వేదికలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వం, డిజిటల్ ప్లాట్ఫామ్ సంస్థలు తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోతే ఆగస్టు 8, 2026 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కనీస బేస్ ఛార్జీ, కిలోమీటర్, నిమిషానికి న్యాయమైన చార్జీలు నిర్ణయించడం, తెలంగాణ గిగ్ కార్మికుల నిబంధనలను వెంటనే అమలు చేయడం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025 ప్రకారం కనీస చార్జీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!