

కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి పిస్టల్స్, వాహనాలు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ అనంతరం నిందితులు బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్కు పారిపోయినట్లు విచారణలో వెల్లడైంది. ప్రత్యేక బృందాలు బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈ కేసులో బీహార్కు చెందిన ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరుగాంచిన సుబోద్ సింగ్ను మాస్టర్ మైండ్గా పోలీసులు గుర్తించారు. మొత్తం చోరీలో ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 13 మంది ఈ దోపిడీకి సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్తో పాటు మరో 10 మంది నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!