
జనరల్

హైదరాబాద్ సనత్నగర్లోని జెడ్ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి నివాసంలో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో పక్కా ప్రణాళికతో చొరబడిన దుండగులు సుమారు రూ.1.5 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!