
రాజకీయాలు

రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్కు సీఎం ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.
240 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఆధునిక మార్కెట్ రైతులకు భద్రతతో కూడిన మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!