

₹2,000కు మించిన నిర్దిష్ట యూపీఐ వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలన్న నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై ప్రతిపక్షాలతో పాటు కొందరు బీజేపీ అనుకూల సోషల్ మీడియా కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. అయితే ఎండీఆర్ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ₹2,000 వరకు వ్యాపారి చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయి.
ఈ నిర్ణయంపై నెటిజన్లు మీమ్స్, వ్యంగ్య పోస్టులతో స్పందిస్తున్నారు. ‘డిజిటల్ ఇండియా.. నగదురహితం’ అంటూ యూపీఐ ఉచిత సేవలకు సంబంధించిన పాత ప్రచారాన్ని గుర్తుచేస్తూ కొందరు సెటైర్లు చేస్తున్నారు. మరోవైపు, ఎండీఆర్ వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వ్యాపారులు భవిష్యత్తులో ధరలను పెంచి ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ప్రకారం, వ్యాపారులు ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై బదిలీ చేయకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!