
సినిమాలు

విశాఖపట్నంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను ఆయన సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులపై ఒత్తిడి పెరిగిందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, గాయపడిన ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!