

పోలవరం పరిధిలోని ఇర్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివాని ఇటీవల నిర్వహించిన ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేసింది. అదే కార్యక్రమంలో సీఎంతో సెల్ఫీ కూడా దిగింది. తాజాగా ఆమె మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
శివాని మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైనా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడి సహాయం తీసుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!