

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా అనుబంధ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో విమానాశ్రయ ఆస్తులకు నష్టం కలగడంతో పాటు పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు అంతర్జాతీయ విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు.
ఇటీవల అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్లలోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు సూచించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!