

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, నీట్ 2026 ప్రశ్నాపత్రం ప్రశ్నల తయారీ దశలోనే లీక్ అయినట్లు వెల్లడించారు. ప్రశ్నాపత్రం తయారీదారులే పరీక్షా వ్యవస్థలో “నమ్మకానికి మూలం” అని పేర్కొంటూ, ఈ ఘటన సాంకేతిక లోపం కాదని, మానవ నైతికత వైఫల్యమని స్పష్టం చేశారు. ఎన్క్రిప్షన్, ఎయిర్ గ్యాప్ నెట్వర్క్ల వంటి భద్రతా చర్యలు ఉన్నప్పటికీ, అంతర్గత వ్యక్తుల వల్ల ఈ లీక్ జరిగినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
నందన్ నీలేకణి నేతృత్వంలోని పరీక్షా సంస్కరణల టాస్క్ ఫోర్స్ సభ్యుడైన కామకోటి, ప్రశ్నాపత్రం తయారీ ప్రక్రియను మరింత భద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లీక్ల వెనుక సంఘటిత నేరజాలం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా, నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత మల్టీ సెషన్ విధానానికి మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, అనేక సురక్షిత ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయడం పెద్ద సవాల్గా ఉందని పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!