

లీజు వివాదానికి సంబంధించిన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్, నటులు వెంకటేశ్, రాణా దగ్గుబాటి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కేవలం వివాదం సివిల్ స్వభావానికి చెందినదనే కారణంతో ఈ దశలో క్రిమినల్ కేసును కొట్టివేయడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోరే నందకుమార్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, దానిని రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ ఎన్. తుకారాంజీ విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఈ వివాదం పూర్తిగా సివిల్ అంశమని వాదించారు. అయితే ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది, లీజులో ఉన్న ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి తలుపులు ధ్వంసం చేసి వస్తువులు తీసుకెళ్లారని ఆరోపించారు. ఫిర్యాదు, దానికి జత చేసిన అఫిడవిట్లను పరిశీలించిన న్యాయస్థానం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేసును రద్దు చేసేందుకు నిరాకరించింది. తమ అభ్యంతరాలను విచారణ కోర్టు ముందే వినిపించుకోవాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!