
రాజకీయాలు

మహారాష్ట్రలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. భివాండీ, ముంబయి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ముంబయిలో పలు ప్రాంతాల్లో 10 సెం.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రహదారులు నీటితో నిండిపోవడంతో చెరువులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని బృహన్ ముంబయి కార్పొరేషన్ ప్రజలకు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!