
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 12 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఆరు జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’, మరో ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా ప్రమాదకర ప్రాంతాల్లో ఉండవద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!