
సినిమాలు

విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం నైరుతి రుతుపవనాలు చురుకుగా మారి ఏపీ మీదుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ప్రాంతంలో గంటకు 50–60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు కూడా ఉండొచ్చని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!