

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పంటలను తక్షణమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భారాస శాసనసభాపక్ష ఉపనాయకుడు టి. హరీశ్రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ కాంగ్రెస్ ‘రైతు డిక్లరేషన్’ విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం పెద్ద మొత్తంలో వస్తున్నా కొనుగోళ్లు ఆలస్యం కావడాన్ని తప్పుబట్టారు. మిల్లుల్లో కటింగ్ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని, కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారాస ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.
అదేవిధంగా సిద్దిపేటలో రుణమాఫీపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. 43,363 అర్హుల రైతుల్లో కేవలం 20,514 మందికే రుణమాఫీ జరిగిందని పేర్కొంది. సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!