

టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు కల్పించిన పోలీసు భద్రతను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తన నివాసం వద్ద జరుగుతున్న నిరసనలు, కుటుంబ భద్రతపై ఉన్న ఆందోళనలను ఆయన పిటిషన్లో ప్రస్తావించారు.
ఈ పిటిషన్పై స్పందించిన పంజాబ్ హైకోర్టు, భద్రత ఉపసంహరణపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ మే 12న జరగనుంది. హర్భజన్కు కల్పించిన తొమ్మిది మంది పోలీసు సిబ్బందితో కూడిన భద్రతను ఇటీవల ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఇటీవల ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు పార్టీ మారిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్యపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది కక్షపూరిత నిర్ణయమని ఆరోపిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!