

హైదరాబాద్ నగరానికి చెందిన చెత్తను మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డులో వేస్తుండగా, అక్కడ కాలుష్య సమస్య తీవ్రరూపం దాల్చింది. గత పదిహేనేళ్లుగా భారీగా చెత్త పేరుకుపోవడంతో డంపింగ్ యార్డు గుట్టలా మారిపోయింది. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ జరగకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, పరిసర మున్సిపాలిటీల నుంచి రోజుకు దాదాపు పది వేల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడికి చేరుతోంది.
ప్రభుత్వం డంపింగ్ యార్డు ఒత్తిడి తగ్గించేందుకు కొత్త ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దుండిగల్లో ఆధునిక విధానాలతో ఏర్పాటు చేసిన వ్యర్థాల కేంద్రం మాదిరిగా ఇతర ప్రాంతాల్లో కూడా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. జవహర్ నగర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త స్థలాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!