

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) గోదావరి వరద పరిస్థితిపై తాజా హెచ్చరిక జారీ చేసింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కూనవరం వద్ద నీటిమట్టం 19.20 మీటర్లు, పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 8,36,315 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం త్వరలో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక, రాత్రికి 13 లక్షల క్యూసెక్కులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. మొత్తం వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటిస్తూ సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!