

‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు రమా నందన, ఆమె భర్త మధుకర్పై ఉద్యోగాలు మరియు వీసా సేవల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్లో కేసు నమోదైనప్పటికీ, ఈ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఫిర్యాదుదారు శివ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, యూకేలో ఉద్యోగ అవకాశాలు, వీసా రెన్యువల్, భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ (CoS) కల్పిస్తామని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా రూ.15 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు.
తరువాత అందించిన సీవోఎస్ నకిలీదిగా తేలిందని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కేవలం రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మధుకర్, రమా నందన, మోహన్రావును నిందితులుగా చేర్చిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, పలు రాష్ట్రాలకు చెందిన మరికొందరు కూడా ఇలాంటి మోసాలకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను రమా నందన ఖండిస్తూ, తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని, తమ పేర్లతో ఎలాంటి సంస్థలు లేవని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!