
జనరల్

ఎబోలా అనే ప్రాణాంతక వైరస్ కాంగో, ఉగాండా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భారత్లో కూడా హెల్త్ అలర్ట్ జారీ చేశారు.
ముఖ్యంగా ముంబై వంటి రద్దీ నగరాల్లో బృహణ్ ముంబై కార్పొరేషన్ సివిక్ ఆస్పత్రుల్లోని రెసిడెంట్ డాక్టర్లకు ఎబోలా అడ్వయిజరీ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా, ముందస్తు అవగాహన, అప్రమత్తత కోసం ఈ చర్యలు తీసుకున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!