
సినిమాలు

ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని ఆచరణలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే నిర్ణయంగా ఇది ప్రశంసలు అందుకుంటోంది.
క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం పార్వతీపురంలో పదో తరగతి విద్యను కొనసాగించనున్నారు. జిల్లా కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు. గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ కూడా తన కుమారుడిని ఇదే పాఠశాలలో చదివించడం విశేషంగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!