
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఓటర్ల జాబితా ఎన్నికల వ్యూహాలకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా చూసుకోవాలని, గ్రామస్థాయి వరకు నిరంతర పరిశీలన జరగాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పార్టీ రోజువారీగా పర్యవేక్షిస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!