
జనరల్

సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన 22వ నివేదికలో ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు 89 కేసులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే ఏపీ అసెంబ్లీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై, తెలంగాణ అసెంబ్లీలో 68 శాతం మంది ఎమ్మెల్యేలపై నేరారోపణలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు మరోసారి చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!