
సినిమాలు

తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాల్లో ఝార్ఖండ్లోని రాంచీకి చెందిన అవని కేజ్రీవాల్ అరుదైన ఘనత సాధించారు. రీవాల్యుయేషన్ అనంతరం ఆమెకు మొత్తం 500లో 500 మార్కులు రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అవని మాట్లాడుతూ, తొలుత మూడు సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు వచ్చినప్పటికీ, తనకు ఎంతో ఇష్టమైన ఇంగ్లిష్లో 19 మార్కులు, బిజినెస్ స్టడీస్లో 5 మార్కులు తగ్గడం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. తన సమాధానాలపై నమ్మకంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా, మొత్తం 24 మార్కులు పెరిగి చివరకు 500/500 మార్కులు సాధించినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!