

నమ్రతా శిరోద్కర్ తన భర్త సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్డే ఎంబీ… ప్రతి రోజును మా కోసం ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ సంవత్సరం మరింత ప్రేమ, ఆరోగ్యం, ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ, కుటుంబం తరఫున ఎంతో ప్రేమిస్తున్నామని తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో కుటుంబ ఫొటోను పంచుకోగా అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.
లెజెండరీ నటుడు కృష్ణ కుమారుడైన మహేశ్ బాబు, ‘వంశీ’ సినిమా సమయంలో నమ్రతాతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు స్వస్తి చెప్పి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి ఓ భారీ చిత్రంపై పని చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!