

ఒమన్ సమీపంలో ప్రయాణిస్తున్న ఎవర్ లవ్లీ అనే కార్గో నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. తమకు అనుకూలం కాని మార్గాల్లో ప్రయాణించే నౌకలకు భద్రత ఉండదని ఇరాన్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ సముద్ర భద్రతా అధికారులు ఈ దాడిని ధృవీకరించగా, ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు దీని వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఘటన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు అందిస్తున్న ఎస్కార్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న వందలాది నౌకలు, వేలాది మంది నావికుల భద్రతపై సమీక్ష చేపట్టాయి. హోర్మూజ్ జలసంధిలో చిన్న అంతరాయం కూడా ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!