
రాజకీయాలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న బస్సు రెండో ఘాట్ రోడ్డులో టిప్పర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పెద్దలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన భక్తులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రెండో ఘాట్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ట్రాఫిక్ను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!