
రాజకీయాలు

చట్టపరమైన విధానాలు పాటించకుండా మహిళ పడకగదిలోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం ఆమె గోప్యత, గౌరవానికి భంగం కలిగించే చర్య అని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై బాధిత మహిళకు రూ.10 వేల పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గోప్యత హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని కోర్టు స్పష్టం చేసింది.
నాగ్పూర్కు చెందిన 26 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, పోలీసులు దర్యాప్తు పేరుతో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేస్తూ, బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!