
బిజినెస్

అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన పత్రం లభించడం కలకలం రేపింది. ఎక్స్రే గదిలో అనుమానాస్పద డాక్యుమెంట్ను గుర్తించిన కాలేజీ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరు విద్యార్థులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ పత్రంలో బాంబుల తయారీలో ఉపయోగించే పదార్థాల జాబితా ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!