
క్రీడలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుడుతున్నారు. ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.586 కోట్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో ఆలయ ఆధ్యాత్మికతను పరిరక్షిస్తూ ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.
తొలి విడతలో రూ.200 కోట్లతో విస్తరణ పనులు చేపట్టనున్నారు. భక్తులకు మెరుగైన వసతులు, ఆలయ పరిసరాల అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి తొలి దశ పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!