

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీసీ’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన లోకేష్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కడంతో హీరోగా మరిన్ని సినిమాలు చేయాలనే ఆసక్తి పెరిగినట్లు సమాచారం. అయితే దర్శకత్వాన్ని కొనసాగిస్తూనే నటనపై కూడా దృష్టి పెట్టాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హీరోగా తన తదుపరి చిత్రాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి లోకేష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘డీసీ’తో తనకు మంచి విజయాన్ని అందించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో మరోసారి హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ చిత్రం ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో లోకేష్ తదుపరి హీరో ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు దాదాపు ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!