
ఆరోగ్యం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. "ముందు దేశం, తర్వాత పార్టీ, చివరగా నేను" అనే సిద్ధాంతాన్నే భారతీయ జనతా పార్టీ అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించే వరకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రజా జీవితంలో విశేష సేవలు అందించారని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాట వినడం, వారి అభిప్రాయాన్ని గౌరవించడం, అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోవడమేనని బండి సంజయ్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వైదొలగడం పదవి కంటే బాధ్యత, స్వార్థం కంటే దేశం అనే బీజేపీ విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!