
జనరల్

అయోధ్య విరాళాల కుంభకోణం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ తన పదవికి రాజీనామా చేయగా, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. దాదాపు రూ.200 కోట్ల విరాళాలు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఎస్ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే చంపత్రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్తో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎస్ఐటీ అరెస్ట్ చేసింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!