
జనరల్

పార్లమెంట్లో నేడు విద్యార్థుల ఆందోళనలపై చర్చ జరగనుంది. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగంపై వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో కేంద్రం ఈ డిమాండ్కు అంగీకరించింది.
ఇదిలా ఉండగా, నేడు ఇండి కూటమి నేతలు పార్లమెంట్లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో సమావేశం కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!