
బిజినెస్

అసోం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాకు చెందిన ప్రీమియం సీటీసీ టీ బ్రాండ్ డెక్కియాజులి టీ గువాహటి టీ ఆక్షన్ సెంటర్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ టీ కిలో ధర రూ.800 పలకడంతో అసోం టీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. డెక్కియాజులి టీని మురుగప్ప గ్రూప్కు చెందిన ప్యారీ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది.
ఈ ఘనతపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో స్పందిస్తూ, అసోం టీ ప్రపంచస్థాయిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన అసోం టీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ రికార్డు ధర అసోం టీ పరిశ్రమకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపును తీసుకువస్తుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!