

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామకాలు పొందిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి కేబినెట్ అంగీకరించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సుమారు 11 వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుందని సీపీఎస్ సంఘం తెలిపింది. అలాగే 8 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!