

టీసీఎస్కు అనుబంధంగా ఉన్న బీపీఓ యూనిట్లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై ఎఐఎంఐఎం కౌన్సిలర్ మతీన్ పటేల్ను నాసిక్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై వారెంట్ జారీ అయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మార్చి 2026లో నాసిక్లోని టీసీఎస్ అనుబంధ బీపీఓ యూనిట్లో లైంగిక వేధింపులు, కార్యాలయ దుర్వ్యవహారం, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలపై కేసులు నమోదయ్యాయి. గర్భవతి కావడంతో నిదా ఖాన్కు జూలైలో బెయిల్ లభించగా, చార్జ్షీట్ దాఖలైన అనంతరం మరికొందరు నిందితులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తుండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను టీసీఎస్ సస్పెండ్ చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!