

కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. న్యాయమూర్తి విచక్షణను, మానవీయ ఆలోచనా విధానాన్ని అది భర్తీ చేయలేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో లీగల్ ఎరా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ వార్షిక లీగల్ ఎరా ఇండియా కాన్క్లేవ్-2026కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయస్థానాలు రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో సాంకేతికత ఎంతో సహాయపడుతుందని, అయితే న్యాయమూర్తుల నిర్ణయ ప్రక్రియలో ఏఐ కేవలం సహాయక సాధనంగానే ఉంటుందని పేర్కొన్నారు.
మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తులో టెక్నో-లీగల్ నిపుణుల అవసరం గణనీయంగా పెరుగుతుందని జస్టిస్ సూరేపల్లి నంద తెలిపారు. అనంతరం కార్పొరేట్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు న్యాయ నిపుణులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ కృష్ణ గ్రంథి, మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ఇషా సిన్హా, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ దివ్య అడెపు తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!