

శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో కొత్త ఫైవ్స్టార్ హోటళ్లు ఏర్పాటవుతున్నాయి. ఒబెరాయ్ గ్రూప్, వెంకటేశ్వర హోటల్స్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాయి. ఒబెరాయ్ గ్రూప్ 3.63 ఎకరాల్లో రూ.532 కోట్లతో, వెంకటేశ్వర హోటల్స్ ఎకరం స్థలంలో రూ.102 కోట్లతో హోటళ్లను నిర్మించనున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయ పరిసరాల్లో నోవోటెల్ మాత్రమే ప్రధాన ఫైవ్స్టార్ హోటల్గా ఉంది. వీఐపీలు, విదేశీ అతిథుల రాకపోకలతో ఇది తరచూ రద్దీగా ఉంటోంది. దీంతో మరిన్ని ఫైవ్స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్-3లో భూములను కేటాయించింది.
విమానాశ్రయం చుట్టుపక్కల కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు వేగంగా విస్తరిస్తుండటం, భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించడంతో పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది. విమానాశ్రయానికి 10–15 కిలోమీటర్ల పరిధిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులు పూర్తయితే విదేశీయులు, పర్యాటకుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హార్డ్వేర్ పార్క్-3లో హోటళ్లు, పరిశ్రమల నిర్మాణం ప్రారంభించిన తేదీ నుంచి 18 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని టీజీఐఐసీ అధికారులు గడువు విధించారు. ఇప్పటికే ఏరోస్పేస్ పార్కులు, రక్షణ రంగానికి విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు, అమెజాన్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడంతో మహేశ్వరం–తుక్కుగూడ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!